Breaking News

హైదరాబాద్‌లో దారుణం.. అన్నదమ్ముల చేతిలో రౌడీ షీటర్ హత్య


హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దిల్‌షుక్ నగర్ పీఅండ్‌టీ కాలనీలో వినయ్ అనే రౌడీ షీటర్‌ను అన్నదమ్ములే హత్య చేశారు. వినయ్‌ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం వెంటనే తల్లికి ఫోన్ చేసి వినయ్‌ను హతమార్చినట్లు సమాచారం అందించారు. వెంటనే అక్కడ్నుంచి సంతోష్, సందీప్ పరారయ్యారు. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వినయ్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వినయ్‌, సంతోష్, సందీప్ సొంత అన్నదమ్ములు. వీరు ముగ్గురు కూడా రౌడీ షీటర్లే. వీరిపై రాజమండ్రి, ఛత్రినాక, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌లలో పలు కేసులు కూడా ఉన్నాయి. అయితే గతంలో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలుస్తోంది. అయితే సెల్ ఫోన్ విషయంలో ఈ ముగ్గురు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని సమాచారం. కొత్తగా కొన్న ఫోన్ తనకు ఇవ్వాలని వినయ్ గొడవకు దిగాడు. ఈ విషయమై నిన్న రాత్రి వినయ్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే అర్థరాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో పీఅండ్ టీ కాలనీకి రావాలని వినయ్ చెప్పాడంతో... అక్కడకు సందీప్ సంతోష్ వెళ్లాడు. అక్కడ ముగ్గురు మధ్య గొడవ మరింత ముదిరిపోవడంతో వినయ్‌ను హత్య చేసి పరారయ్యారు.


By June 25, 2020 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-rowdy-sheeter-brutally-murdered-by-own-brothers/articleshow/76618523.cms

No comments