పోకిరీ వేధింపులు.. హైదరాబాద్లో బీటెక్ విద్యార్థిని సూసైడ్

ప్రేమ వేధింపులు ఓ యువతి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. టైర్ల షాపులో పనిచేసే యువకుడు నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని అమీర్పేటలో జరిగింది. అమీర్పేటలోని ఈస్ట్ శ్రీనివాస్నగర్ కాలనీలోని అనురాగ్ అపార్ట్మెంట్లో ఉండే ఆర్టీసీ కండక్టర్ ఎం.గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. వీరి పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. Also Read: ఆమె రోజూ కాలేజీకి వెళ్లొచ్చే క్రమంలో అదే ప్రాంతంలో ఓ టైర్ల షాపులో పనిచేసే నవీన్ అనే యువకుడు వేధించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పించేస్తారన్న ఆందోళనతో అశ్విని బయటకు చెప్పుకోలేదు. లాక్డౌన్ కారణంగా ఆమె సుమారు రెండున్నర నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. దీంతో నవీన్ తరుచూ ఫోన్ చేసి ఆమెను విసిగిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన అశ్విని ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో చదువుకుంటానని తల్లికి చెప్పి అపార్ట్మెంట్ పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్ చేసి నవీన్ వేధింపుల గురించి చెప్పి ఏడ్చింది. Also Read: నవీన్ వేధింపులు భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు విషం తాగేశానని అశ్విని తండ్రికి చెప్పింది. దీంతో గోపాల్ వెంటనే అపార్ట్మెంట్ పైకి వచ్చి చూడగా కూతురు నోట్లో నుంచి నురగలు కక్కుతూ కనిపించింది. దీంతో ఆయన వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. Also Read:
By June 09, 2020 at 07:14AM
No comments