Breaking News

భారత్‌ భూభాగంలోకి పాక్ డ్రోన్.. కూల్చేసిన సైనికులు


ఓ వైపు భారత్‌పై చైనా చెలరేగిపోతుంటే.. మరోవైపు దాయాది దేశం పాక్ కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు గుర్తించాయి. గూడఛర్య డ్రోన్‌లో ఆయుధాలను పంపి ఎల్‌వోసీ దాటిస్తోన్ డ్రోన్ కెమెరాను భారత సైనికులు కూల్చి వేశారు. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. అనుమానాస్పందంగా కదులుున్న డ్రోన్ కనిపించింది. దీంతో 19వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. భారత భూభాగంలో డ్రోన్ పడిపోయింది. పాకిస్తాన్ స్పై డ్రోన్‌ను స్వాధీనం చేసుకొని.. తనిఖీ చేయగా అందులో ఆయుధాల బయటపడ్డాయి. ఐతే డ్రోన్‌లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్‌ను ఎందుకు పంపించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.


By June 20, 2020 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistani-spy-drone-was-shot-down-by-border-security-force-in-pansar-kathua/articleshow/76477108.cms

No comments