Breaking News

విషాదం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలి ఇద్దరు మృతి


ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఉన్నట్టుండి కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలోని ఈటాహ్ జిల్లా మలవాన్ ప్రాంతంలో జరిగింది ఘటన. జాతీయ రహదారి 91 పై మలవాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కూలినపుడు అటుగా ఓ కారు రావడంతో అది సరిగ్గా వాహనంపైనే పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఇద్దరి మృతదేహాలను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టరుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఈటాహ్ జిల్లా కలెక్టరు సుఖ్ లాల్ భారతి చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న వంతెన కూలడంతో అటువైపుగా రావాలంటేనే జనం భయపడుతున్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంతభాగం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది. గతంలో రద్దీ రోడ్లపై కూడా నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి.


By June 20, 2020 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/2-dead-in-under-construction-bridge-collapse-in-up/articleshow/76475284.cms

No comments