ఇంటర్ బాలికకు ప్రేమ వల.. గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను లైంగికంగా దోచుకుని గర్భవతిని చేసిన ఘటన తమిళనాడులోన అరియలూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని కాత్తాన్కుడికాడు గ్రామానికి చెందిన పరమశివం (21) అనే యువకుడు అరియలూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో పీజీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్లస్టూ విద్యార్థినిపై కన్నేసిన అతడు మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. తరుచూ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. Also Read: బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు వైద్య పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో వారు అబార్షన్ చేయాలని డాక్టర్లను కోరారు. అందుకు నిరాకరించిన డాక్టర్లు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అరియలూరు మహిళా పోలీసులు వెంటనే హాస్పిటల్కు వెళ్లి బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడు పరమశివంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By June 01, 2020 at 11:08AM
No comments