Breaking News

కన్నవారికి భారం కావొద్దని మహిళ ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు


కట్టుకున్న భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి చేరింది. వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా పోషించేందుకు పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. బ్రతికుండి వారికి భారంగా మారడం కంటే చావే శరణ్యమనుకుంది. దీంతో కన్నవారిని, కన్నబిడ్డలను వదిలి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని జిల్లాలో వెలుగుచూసింది. Also Read: కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఫరీద్‌పేటకు చెందిన తైరంచ రాజిరెడ్డి కుటుంబంతో సహా చాలా ఏళ్ల క్రితమే దేవునిపల్లి గ్రామానికి వలస వచ్చాడు. ఒక్కగానొక్క కూతురు నవ్య(29)ను మెదక్‌ జిల్లాకు చెందిన స్వతంత్రరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించాడు. వారికి హర్షితారెడ్డి, సాకేత్‌రెడ్డి సంతానం కలిగారు. ఆరేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో స్వతంత్రరెడ్డి చనిపోవడంతో నవ్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఓ ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. Also Read: అయితే వచ్చే జీతం ఖర్చులకు సరిపోకపోవడంతో పాటు లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా జీతం రావడం లేదు. దీంతో తాను తల్లిదండ్రులకు భారంగా మారని నవ్య మనస్తాపం చెందేది. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తల్లి ఆత్మహత్యతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. వృద్ధ్యాప్యంలో ఉన్న తాము పిల్లలను ఎలా సాకాలంటూ రాజిరెడ్డి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:


By June 11, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-kamareddy-over-family-problems/articleshow/76313774.cms

No comments