Breaking News

ఆడబిడ్డను చంపేసిన అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ.. తూ.గో. జిల్లాలో దారుణం


జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల భారమనుకున్న తల్లి, అమ్మమ్మ, తాతమ్మ ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండలంలోని చినకొండేపూడి పంచాయతీ కొత్తూరులో జరిగింది. బాలిక కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. పసికందు తల్లి(21), అమ్మమ్మ, తాతమ్మ ఈ దురాగతానికి ఒడిగట్టారని తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోరుకొండ డీఎస్పీ పీఎస్‌ఎన్ రావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి శనివారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. Also Read: కొత్తూరులోని ఓ కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల పుట్టింట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వంశపారపర్యంగా మూడు తరాలుగా ఆడపిల్లలే పుట్టడంతో తల్లి పుట్టింటి వారు ఇష్టపడలేదు. ఇంట్లోని మగవారికి తెలియకుండా ఆ పసికందును హతమార్చాలని మహిళలే కుట్ర పన్నారు. 15 రోజులుగా ఎన్నో కుట్రలు పన్నినా చంపే సాహసం చేయలేకపోయారు. బిడ్డకు 21వ రోజు వస్తే ఊయలలో వేసి సంబరాలు చేయాలనే బెంగ వారిలో మొదలైంది. శుక్రవారం(బిడ్డకు 16వ రోజు) తెల్లవారుజమున బిడ్డను ఎత్తుకుని తల్లి, అమ్మమ్మ, తాతమ్మ ఇంటి పక్కనున్న పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి పసికందును అందులోకి విసిరేశారు. తెల్లవారాక బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారంటూ ఇంట్లోని మగవారికి చెప్పి నాటకమాడారు. Also Read: దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కుటుంబంలోని ప్రశ్నించిన పోలీసులకు మగవారిలో తీవ్ర ఆందోళన కనిపించగా, మహిళల మొహాల్లో ఎలాంటి విచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే బిడ్డను చంపినట్లు అంగీకరించారు. Also Read:


By June 21, 2020 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-days-old-baby-murdered-by-family-members-in-east-godavari-districr/articleshow/76489354.cms

No comments