Breaking News

విషాదం.. కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రిలో వ్యక్తి సూసైడ్


కేరళలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకి కోలుకున్న తర్వాత ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా నుంచి కోలుకున్న ఓ రోగి ఆసుపత్రి ఐసోలేషన్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువనంతపురం వైద్యకళాశాల ఆసుపత్రిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే 33 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి నుంచి రెండు సార్లు పారిపోయాడు. సొంత ఊరికి వెళ్లిన అతడ్ని గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. దీంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. మళ్లీ కరోనా పరీక్ష చేయడంతో నెగిటివ్ అని వచ్చింది. వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేద్దామనిసరేకి ఆ వ్యక్తి ఐసోలేషన్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తిరిగి అధికారులకు అప్పగించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఇక మరోవ్యక్తి మద్యం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఇది కాస్త వివాదంగా మారె అవకాశం ఉండడంతో విచారణకు ఆదేశించింది కేరళ సర్కార్.


By June 11, 2020 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/corona-patient-who-fled-kerala-hospital-commits-suicide/articleshow/76313471.cms

No comments