పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం.. 8 నెలలకే ఆత్మహత్య.. కృష్ణా జిల్లాలో విషాదం

వారిద్దరు ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. అయితే చిన్న విషయానికి తలెత్తిన వివాదంతో క్షణికావేశానికి గురైన ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా మండలం అల్లూరుకు చెందిన గుంజి వెంకటేశ్వరరావు(23), పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన శ్రావణి(21) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో గతేడాది అక్టోబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రావణి ఇటీవలే గర్భం దాల్చింది. Also Read: ఈ క్రమంలోనే బుధవారం(జూన్ 10) తన పుట్టింట్లో జరిగే శుభకార్యానికి వెళ్లొస్తానని శ్రావణి కోరగా వెంకటేశ్వరరావు ఒప్పుకోలేదు. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన శ్రావణి అదే రోజు పురుగులమందు తాగింది. దీంతో వెంకటేశ్వరరావు, స్థానికుల సాయంతో ఆమె నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడకు, అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. శ్రావణి పరిస్థితి విషమంగా ఉందని, బ్రతకడం కష్టమని గురువారం డాక్టర్లు తేల్చి చెప్పడంతో వెంకటేశ్వరరావు ఆందోళన చెంది ఆస్పత్రి బయట పరుగుల మందు తాగేశాడు. Also Read: అతడిని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. శ్రావణి శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోగా, సాయంత్రం వెంకటేశ్వరరావు కూడా చనిపోవడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో ఆ జంట తీసుకున్న నిర్ణయం పచ్చటి కాపురాన్ని చిదిమేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read:
By June 13, 2020 at 08:47AM
No comments