Breaking News

యూపీ బాలికల ఆశ్రమం: 57 మందికి కరోనా పాజిటివ్.. వీరిలో ఐదుగురు గర్భవతులు!


ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఆశ్రమంలో 57 మంది బాలికలకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. కాన్పూరులోని ఓ వసతిగృహం ప్రస్తుతం కరోనా క్లస్టర్‌గా మారినట్టు అధికారులు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ అయిన మొత్తం 57 మందిని వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. వైరస్ సోకని మిగతా బాలికలు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచి, ఆ భవనాన్ని సీల్ చేశారు. అయితే, ఈ వసతిగృహంలోని కనీసం ఇద్దరు బాలికలు గర్బందాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని స్థానిక మీడియాలో ఆదివారం విస్తృత ప్రచారం సాగడంతో బాలికల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిపై కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ బ్రహ్మ దేవ్ తివారీ మాట్లాడుతూ... గర్బం దాల్చిన ఐదుగురు బాలికలు వాస్తవానికి, గత ఏడాది డిసెంబర్‌లో ఆశ్రమంలో చేరారని, అప్పటికే వారు గర్భవతులని అన్నారు. ఈ ఐదుగురూ వివిధ జిల్లాల్లోని శిశు సంక్షేమ కమిటీల ద్వారా ఈ ఆశ్రమానికి చేరారని, పోస్కో చట్టం కింద కేసుల్లో బాధితులన్నారు. ఆశ్రమంలో చేరేసరికి వారు గర్బం దాల్చినట్టు వివరించారు. ఆశ్రమంలోని సిబ్బంది ఇటీవల ఇద్దరు బాలికలతో కలిసి కాన్పూర్ హాస్పిటల్‌కు వెళ్లారని, అక్కడ కోవిడ్-19 రోగులతో కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి వైరస్ సోకిందని యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు పూనమ్ కపూర్ వ్యాఖ్యానించారు. కాన్పూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 400 దాటగా.. రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఉత్తప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసులు 17వేలు మార్క్ దాటింది. అయితే, వీరిలో 11వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం 6వేలు యాక్టివ్ కేసులు ఉన్నాయి.


By June 22, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/57-girls-at-government-run-home-in-ups-kanpur-test-positive-for-coronavirus/articleshow/76502727.cms

No comments