Breaking News

ట్యాంకర్ పేలి 18 మంది మృతి.. 189మందికి గాయాలు


చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ట్యాంకర్ పేలిన ఘటనలో 18 మంది మరణించగా, మరో 189 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని బెజియాంగ్ ప్రావిన్సులోని వెన్లింగ్ నగర జాతీయ రహదారిపై ట్యాంకర్ ట్రక్ పేలింది. ఈ పేలుడులో జాతీయ రహదారికి సమీపంలోని భవనాలు, వర్క్ షాపులు కూలిపోయి కొంతమంది మరణించారు. ఈ పేలుడు వల్ల రహదారి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. పేలుడు ప్రభావంలో పలువురి శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. 18 మంది మరణించగా, తీవ్రంగా గాయపడిన 189 మందిని ఆరు ఆసుపత్రులకు తరలించారు.లిక్విఫైడ్ గ్యాస్ తో వెళుతున్న ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న 34 ఫైర్ ఇంజన్లు, 138 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 600పైగా మెడికల్ సిబ్బంది గాయపడ్డ వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హైవేనే మూసివేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. పేలుడు కారణాలపై విచారణ జరుపుతున్నాట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.


By June 14, 2020 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/19-dead-in-e-china-lng-tanker-explosion/articleshow/76366134.cms

No comments