Breaking News

‘బిడ్డ తనకు పుట్టలేదని వదిలించుకున్న ప్రియుడు’.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి


ప్రేమించి వెంట తిరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సహజీవనం చేసి బిడ్డ పుట్టాక మొహం చాటేసిన ప్రియుడి కోసం యువతి ఆందోళన చేపట్టింది. తన ఆరు నెలల బిడ్డతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుబల్లికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన మోదుగు నాగరాజు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చి ఆరు నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. Also Read: ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరడంతో ప్రియుడు మొహం చాటేశాడు. బాబు తనకు పుట్టలేదంటూ నాగరాజు వివాహానికి నిరాకరించడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ జరిగినా అతడు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం బిడ్డతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు నాగరాజుతో వివాహం జరిపిస్తేనే కిందికి దిగుతానని, లేకపోతే కిందికి దూకేస్తానని బెదిరించింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలితో మాట్లాడి కిందికి వచ్చేలా చేశారు. తన బిడ్డకు నాగరాజే తండ్రి... డీఎన్ఏ టెస్టుకైనా తాను సిద్ధమని యువతి పోలీసులకు చెప్పింది. తగిన న్యాయం చేస్తామని పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు. Also Read:


By May 14, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-try-to-suicide-with-6-month-baby-in-khammam-district/articleshow/75730596.cms

No comments