Breaking News

నెలరోజులుగా అత్యాచారం.. భరించలేక మహిళ ఆత్మహత్య.. తెలంగాణలో దారుణం


వివాహితపై కన్నేసిన ఓ యువకుడు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వాటితో బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ కామాంధుడి వేధింపులు తీవ్రం కావడంతో ఆమె చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లా పాల్వంచలో జరిగింది. ఓ వివాహిత (43) భర్త, ఇద్దరు పిల్లలతో పాల్వంచ పట్టణం సమీపంలోని తండాలో నివసిస్తోంది. వీరిది వ్యవసాయ కూలీ కుటుంబం. అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు(21) కొంతకాలంగా ఆమెపై కన్నేశాడు. ఏడాది క్రితం ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీనిపై పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి అతణ్ని మందలించి విడిచిపెట్టారు. Also Read: కొద్దిరోజుల పాటు ఆమె జోలికి రాని మధు నెల రోజుల క్రితం భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి బెదిరించాడు. ‘అక్రమ సంబంధానికి అంగీకరించకపోతే నీ భర్తను చంపేస్తానని’ బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న దృశ్యాలను సెల్‌ఫోన్లో రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ రోజూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేని ఆమె శుక్రవారం జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా అతడు పాల్వంచ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న మధు, అతడి తల్లిదండ్రులు బాధితురాలి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగులమందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ ప్రవీణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మధు, అతడి తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By May 24, 2020 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-commits-suicide-in-bhadradri-kothagudem-district-over-sexual-harassment/articleshow/75934179.cms

No comments