Breaking News

గుంటూరులో దారుణం... భార్య ప్రాణం తీసిన వివాహేతర సంబంధం


అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. పండంటి కాపురాల్ని దెబ్బ తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్త, భార్య వేరే వ్యక్తులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు... హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అక్రమ సంబంధాలు అనర్థాలకు దారి తీస్తాయని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. వేరే వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. రేపల్లెలో వేరే వ్యక్తితో వివహేతర సంబంధం కారణంగా సౌజన్య అనే వివాహిత హత్యకు గురైంది. భర్త అమెను అతి దారుణంగా హత్య చేశాడు. గత అర్ధరాత్రి భార్య సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం వీరేంద్ర కూడా పురుగుల మందు తాగాడు. నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో వెంటనే వీరేంద్రను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య సౌజన్య, బైరావ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో హత్య చేశానని భర్త వీరేంద్ర చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బైరావ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు సౌజన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.


By May 16, 2020 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ex-marital-affairs-husband-kills-wife-in-guntur/articleshow/75770943.cms

No comments