తల్లిపై దాడి చేశాడని.. అన్నను కత్తెరతో పొడిచి చంపిన తమ్ముడు
అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణం తీసిన ఘటన జిల్లా చంద్రగిరిలో మంగళవారం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన హమీద్, రహమత్ దంపతులు తమ కొడుకులు అన్సర్బాషా(26), షాదిక్తో కలిసి బతుకుదెరువు కోసం ఆరు మాసాల క్రితం చంద్రగిరిలోని ముకుంద వీధికి వలస వచ్చారు. పాతపేట బజారువీధిలో బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో వారి బిర్యానీ సెంటర్ మూతపడింది. మద్యానికి బానిసైన పెద్ద కుమారుడు అన్సర్ బాషా మంగళవారం తల్లితో పాటు పాతపేటలోని ఓ మెడికల్ షాపునకు చేరుకున్నాడు. రూ.300 ఇవ్వాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. Also Read: దీంతో కోపంతో ఊగిసలాడిన అన్సర్బాషా తల్లిపై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న చిన్న కుమారుడు షాదిక్ తల్లికి అడ్డుగా నిలిచి అన్నతో ఘర్షణకు దిగాడు. తల్లిని ఏదైనా చేస్తాడన్న ఆందోళనతో తమ్ముడు షాదిక్ మెడికల్ షాపులోని కత్తెరతో అన్న గొంతు, పొట్ట, కిడ్నీ భాగంలో పొడిచాడు. స్థానికులు అన్సర్బాషాను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి షాదిక్ను అదుపులోకి తీసుకున్నారు. Also Read:
By May 27, 2020 at 09:41AM
No comments