Breaking News

అనుష్క తాజా సినిమాపై రూమర్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన కోన వెంకట్


‘బాహుబలి’ సినిమాతో ఆల్ ఇండియా క్రేజ్ సంపాదించిన .. ఆ తర్వాత ‘భాగమతి’ సినిమా చేసి కాస్త గ్యాప్ తీసుకుంది. తిరిగి రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చిన ఆమె ‘’ మూవీ కంప్లీట్ చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించాయి. నిర్మాతగా వ్యవహరించగా.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు న‌టీన‌టులు భాగమయ్యారు. అనుష్క, మాధవన్ లీడ్ రోల్స్ పోషించారు. అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైన తరుణంలో కరోనా దాడి చేయడంతో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో ఈ సినిమా విడుదలను నిలిపివేశారు మేకర్స్. Also Read: ఈ క్రమంలో ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో పలు సినిమాలను ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తున్నారు. సో.. అనుష్క 'నిశ్శబ్దం' కూడా అమెజాన్ ప్రైమ్‌లొనే నేరుగా విడుదల కానుందని, ఇందుకోసం 26 కోట్ల మేర డీల్ కుదిరిందని వార్తలు వచ్చాయి. ఇవి చూసిన నిర్మాత కోన వెంకట్ ఘాటుగా రియాక్ట్ అవుతూ ఓ ట్వీట్ చేశారు. ''ఎన్నో కష్టాలు, మరెన్నో బాధలు.. అన్నింటినీ ఓర్చుకుంటూ ఎంతో ప్యాషన్‌తో మేమంతా ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చాము.. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు స్ఫూర్తి, ఆక్సీజన్. వాటితో ఏది కూడా సరితూగదని నా అభిప్రాయం. సినిమా అంటే కేవలం సినిమా హాల్స్‌లోనే చూడాలి అంతే.. అదే మా ప్రాధాన్యత కూడా'' అని పేర్కొన్నారు కోన వెంకట్. ఈ ట్వీట్‌ని బట్టిచూస్తే కాస్త ఆలస్యమైనా 'నిశ్శబ్దం' థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.


By May 19, 2020 at 11:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kona-venkat-reaction-on-nishabdam-ott-release/articleshow/75819969.cms

No comments