Breaking News

ఆరుబయట నిద్రపోతున్న బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో దారుణం


హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం నివాసం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్‌చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను అమ్మమ్మ ఇంటి వద్ద దగ్గర ఉంచారు. Also Read: వేసవి కావడంతో ఉక్క పోస్తుందని గురువారం రాత్రి ఆ బాలిక, అమ్మమ్మతో కలిసి ఆరుబయట పడుకుంది. ఈ విషయాన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక నోరు మూసేసి అత్యాచారం చేశాడు. అదే సమయంలో అలికిడి కావడంతో పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి నిద్రలేచి బయటకు వచ్చాడు. ఇక్కడేం చేస్తున్నావని యువకుడిని ప్రశ్నించగా అతడు పరారయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలికను అమ్మమ్మ స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 30, 2020 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/10-yr-old-girl-raped-by-neighbour-in-hyderabad/articleshow/76101563.cms

No comments