Breaking News

భారత్‌కు వెంటిలేటర్లు విరాళం.. ట్రంప్ ప్రకటన


భారత్‌కు వెంటిలేటర్లు అందజేయనున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని నొక్కిచెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. భారతదేశానికి వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామని, ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్యానించారు. వైరస్ కేసుల సంఖ్య 85వేలకు చేరగా.. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో చైనాను అధిగమించింది. తమ స్నేహితులు భారతీయులకు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని చెప్పడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, ఎన్ని వెంటిలేటర్లు ఇస్తామనేది చెప్పలేదు. తాము భారతదేశానికి చాలా వెంటిలేటర్లను పంపుతున్నాం... నేను ప్రధాని మోదీతో మాట్లాడాను.. ప్రస్తుతం కొద్ది సంఖ్యలోనే సరఫరా చేస్తున్నాం. వెంటిలేటర్ల సరఫరాలో తమకు ఎలాంటి కొరత లేదని మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా విలయతాండవానికి అల్లాడిపోయిన అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞ‌ప్తి మేరకు భారత్ 50 మిలియన్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపింది. దీనికి ముందు రోజే భారత్, ప్రధాని మోదీలపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్ పర్యటన ముగించుకుని అమెరికాకు చేరిన మర్నాడే మోదీని ఆకాశానికెత్తారు. ‘భారత్‌తో మనకున్న మంచి సంబంధాలను అధ్యక్షుడు ప్రశంసించారు. కొంతకాలంగా ఆ దేశం అమెరికాకు మంచి భాగస్వామిగా ఉంది. భారతదేశానికి వెంటిలేటర్లను పంపుతామన్న ట్రంప్ ప్రకటను స్వాగతిస్తున్నాం’ అని వైట్‌మౌస్ ప్రెస్ సెక్రెటరీ కయాలేగి మెక్‌నమీ అన్నారు. భారత్‌తో పాటు మరి కొన్ని దేశాలకు వెంటిలేటర్లు పంపనున్నామని తెలిపారు. మీడియాతో శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ... కరోనాపై కలిసి పోరాటం చేసి అదృశ్య శత్రువును ఓడిస్తా! ఈ మహమ్మారి విజృంభణ కాలంలో తాము భారత్ వెంట నిలబడతామని, మోదీతో కలిసి పనిచేస్తామన్నారు. భారతీయ-అమెరికన్లు గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాక్సిన్ అభివృద్ధిలో వారి పాత్ర అత్యంత కీలకం అన్ని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.


By May 16, 2020 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-to-donate-ventilators-to-india-says-president-donald-trump/articleshow/75769953.cms

No comments