Breaking News

హైదరాబాద్‌ టు కర్నూలు.. చేపల పెట్టెల్లో లిక్కర్ స్మగ్లింగ్, ఇద్దరి అరెస్ట్


లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో కొద్దిరోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రెండు ప్రభుత్వాలు మద్యం ధరలను భారీగా పెంచడంతో మందుబాబులు ఆందోళన చెందారు. అయితే ఏపీ కంటే తెలంగాణలోనే కాస్త తక్కువ ధరలు ఉన్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు అక్రమార్కులు మద్యాన్ని అక్రమంగా సరఫరా తరలిస్తూ సరికొత్త దందాకు తెరదీశారు. దీంతో పోలీసులు సరిహదుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి మద్యం సరఫరాను అడ్డుకుంటున్నారు. దీంతో అక్రమార్కులు అతితెలివితో కొత్త పద్ధతుల్లో లిక్కర్‌ను తరలిస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు. ఇలాగే చేపల పెట్టెలో భారీగా తెలంగాణ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు మండలం పంచలింగాల చెక్‌పోస్టులో దొరికిపోయారు. Also Read: చాగలమర్రికి చెందిన డ్రైవర్‌ శివశంకర్‌, సహాయకుడు షాషావలి బొలేరో వాహనంలో చేపలు రవాణా చేసే పెట్టెలు తీసుకొని తెలంగాణ వైపు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. తనిఖీల్లో భాగంగా కర్నూలు పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు వాహనాన్ని పరిశీలించారు. చేపల బాక్సులకు సీలు వేసి ఉండడంతో అనుమానమొచ్చి తెరిచి చూశారు. ఆ బాక్సుల్లో 1001 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మద్యం హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By May 27, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kurnool-police-arrests-two-persons-over-smuggling-piquor-from-hyderabad-to-kurnool/articleshow/76025466.cms

No comments