Breaking News

నిశ్చితార్థం కాగానే బావతో హద్దులు దాటిన యువతి.. తండ్రి మందలింపుతో


బంధువుల అబ్బాయితో వివాహం నిశ్చయమైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెలుగుచూసింది. గుంటూరు జిల్లా దమన్నవారి పాలెంకు చెందిన శివారెడ్డి కొన్నాళ్ల నుంచి మౌలాలిలోని జవహర్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన కుమార్తె కవిత(20)కు మేనత్త కొడుకుతో కొద్దిరోజుల క్రితం వివాహం నిశ్చయించారు. 15రోజుల క్రితం ఆ అబ్బాయి కవిత ఇంటికి రాగా రాగా ఇద్దరూ చనువుగా ఉండటం శివారెడ్డి గమనించాడు. Also Read: నిశ్చితార్థం అయినప్పటికీ పెళ్లి కాకుండా అతడితో అంత చనువుగా ఉండటం మంచిది కాదని శివారెడ్డి శుక్రవారం కూతురికి హితబోధ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కవిత పురుగుల మందు తాగేసింది. కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. ఈ సంఘటనపై శివారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 31, 2020 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-commits-suicide-in-hyderabad-over-familt-disputes/articleshow/76115026.cms

No comments