Breaking News

టిక్‌టాక్‌ వీడియోలు చూడొద్దని మందలించిన తల్లి... బాలిక ఆత్మహత్య


నిత్యం సెల్‌ఫోన్లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం మంచిది కాదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నగరంలోని రామంతాపూర్‌ అరవింద్‌ కాలనీ వీధి–2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్‌వేర్‌ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్‌ ఫస్టియర్ చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా ఇంట్లోనే ఉంటున్న దీపిక రోజూ టిక్‌టాక్ వీడియోలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటానికి బానిసైంది. తల్లి ఏ పని చెప్పినా చేయకుండా రోజంతా సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తూ వస్తోంది. Also Read: దీంతో గురువారం దీపికను తల్లి గట్టిగా మందలించింది. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే ఉంటే ఇంటి పనులు ఎప్పుడు నేర్చుకుంటావని తిట్టింది దీంతో మనస్తాపానికి గురైన ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దీపిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తల్లి, అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా దీపిక ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. తండ్రి రాజలింగం ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 29, 2020 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/17-yr-old-girl-commits-suicide-in-hyderabad-over-parents-refused-watching-tiktok-videos/articleshow/76082717.cms

No comments