Breaking News

వివాహితపై నలుగురు యువకుల గ్యాంగ్‌ రేప్.. వీడియో తీసి బెదిరింపులు


ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సంత్ రావిదాస్ న‌గ‌ర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(32) కట్టెల కోసం ఈ నెల 10వ తేదీన గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లింది. ఆమెను గమనించిన అదే ప్రాంతానికి చెందిన సోనూ బింద్, దీప‌క్ సింగ్, అచే లాల్, మాధ‌వ్ యాద‌వ్ అనే యువకుడు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన కామాంధులు.. ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు. Also Read: అయితే ఆ నలుగురు వీడియోను అడ్డం పెట్టుకుని తరుచూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితురాలు సహించలేకపోయింది. దీంతో జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. ఆయన భార్యను వెంటబెట్టుకుని గోపీగంజ్ పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. Also Read:


By May 31, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-gang-raped-by-four-men-in-uttar-pradesh/articleshow/76116493.cms

No comments