Breaking News

హైదరాబాద్‌లో విషాదం.. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య


చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని ఉప్పల్ సౌత్ స్వరూపానగర్‌లో జరగింది. కింగ్ కోఠిలోని ఆంధ్రా బ్యాంక్‌లో బాల సుందరం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ తెల్లవారుజామున ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి బాల్కనీలో హుక్కుకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు. కుటుంబసభ్యుల్ని విచారిస్తున్నారు. కుటుంబ తగాదాలు, ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు బ్యాంక్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


By May 03, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bank-manager-commits-suicide-in-hyderabad-uppal/articleshow/75514197.cms

No comments