Breaking News

ప్రేమోన్మాది పైశాచికం.. ప్రియురాలిపై కత్తితో దాడి, విషం తాగి ఆత్మహత్య


తాను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్లి అవుతోందన్న అక్కసుతో ఓ యువకుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన రాజధాని బెంగళూరులో జరిగింది. అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మండ్య ప్రాంతానికి చెందిన గిరీశ్‌, అదే ప్రాంతానికి చెందిన యువతి మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. గిరీశ్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి ప్రియురాలిని ఐదు నెలల క్రితం తీసుకొచ్చేశాడు. Also Read: అయితే యువతి కుటుంబీకులు పెళ్లికి అంగీకారం తెలిపి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఆమెను ఉంచి మరో వ్యక్తితో పెళ్లికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గిరీశ్ నెలరోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తనకు దక్కనిని ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో ప్రియురాలిని చంపేయాలనుకున్నాడు. బుధవారం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By May 29, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-after-murder-attempt-on-girlfriend-in-karnataka/articleshow/76083767.cms

No comments