Breaking News

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. చిన్నారి మృతి.. 8 మందికి గాయాలు


జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర జరిగింది. చివ్వెంల మండలం చందుపట్ల సమీపంలో కారును డీసీఎం వాహనం బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. రాంపూర్ తండాకు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో చావుకు వెళ్లి తిరిగి స్వస్థలానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. Also Read: డీసీఎం అతివేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో కారులోని వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By May 07, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-nalgonda-district-one-died-8-injured/articleshow/75591214.cms

No comments