Breaking News

లాక్‌డౌన్ పొడిగింపు.. మనస్తాపంతో పూజారి ఆత్మహత్య


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ మరో 19 రోజులు(మే 3 వరకు) పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 21రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు లాక్‌డౌన్‌ను మోదీ సడలిస్తారేమోనని ఆశగా చూసినా ఫలితం లేకపోయింది. ఆయన ప్రకటనతో కార్మికులు, చిన్న పరిశ్రమల వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. లాక్‌డౌన్‌ను పొడిగించారన్న ఆందోళనతో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఓ ఆలయ పూజారి మంగళారం ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: కర్ణాటకలోని ఉడుపి పట్టణానికి చెందిన కృష్ణ నగరంలోని కండివలీ ప్రాంతంలో గల దుర్గామాత ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. తోటి పూజారులతో కలిసి ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు వారాలుగా ఆయన ముంబయిలోనే ఉండిపోయాడు. లాక్‌డౌన్ సడలిస్తే స్వస్థలానికి వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే మోదీ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురై కిచెన్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన తోటి పూజారులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. Also Read:


By April 15, 2020 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karnataka-priest-commits-suicide-in-mumbai-over-lockdown-extension/articleshow/75150756.cms

No comments