లాక్డౌన్ టెన్షన్... హైదరాబాద్లో బీహార్ యువకుడి ఆత్మహత్య

కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని మోదీ మంగళవారం పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్మికులు హైదరాబాద్ శివారులో జీవిస్తూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇక్కడ ఉపాధి లేక.. స్వస్థలానికి వెళ్లలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరేమో కుటుంబానికి దూరంగా ఉంటూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బీహార్కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read: బీహార్కు చెందిన ఎండీ అమీర్(24) మూడు నెలల క్రితం నగరానికి వచ్చాడు. ఉప్పల్లోని ఓ మెకానిక్ షెడ్డులో పనిచేస్తూ స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో అతడి ఫ్రెండ్ ఎలాగోలా బీహార్కు వెళ్లగా.. అమీర్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. దీంతో కొద్దిరోజులుగా ఒంటరిగా గదిలో ఉంటూ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. శనివారం బీహార్లోని కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడిన అమీర్.. ఒంటరిగా ఉండలేకపోతున్నానని, ఇంటికి వద్దామంటే లాక్డౌన్తో కుదరడం లేదని బాధపడ్డాడు. Also Read: అయితే కొద్దిరోజుల్లో లాక్డౌన్ ఎత్తేశాక ఇంటికి రావొచ్చని, ఆందోళనకు గురవొద్దని కుటుంబసభ్యులకు అమీర్కు సర్దిచెప్పారు. ఖర్చుల కోసం డబ్బులు పంపిస్తామని, ఆందోళణ చెందొద్దని వారు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే ఆదివారం అమీర్ గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అమీర్ ఫోన్ ఎత్తకపోవడంతో ఆందోళన పడిన కుటుంసభ్యులు అతడి ఫ్రెండ్కి విషయం చెప్పారు. అతడు గదికి వెళ్లి చూడగా అమీర్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడిచ్చిన సమాచారంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By April 15, 2020 at 10:44AM
No comments