Breaking News

హైదరాబాదీలపై సైబర్ కేటుగాళ్ల కన్ను.. గంటల్లోనే రూ.లక్షలు కొట్టేశారు


ఓ వైపు దేశమంతా లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా మరోవైపు సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. బ్యాంకు అధికారులు, సోషల్ నెట్‌వర్క్ ప్రతినిధుల్లా నటిస్తూ.. కొందరికి ఫోన్లు చేస్తూ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో కేవలం కొద్ది గంటల్లోనే పలువురి నుంచి ఏకంగా రూ.4.75 లక్షల నగదు దోచుకున్నారు. దీనిపై ఆది, సోమవారాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఖైరతాబాద్‌లో నివసించే ఉదయ్ రక్షక్‌కు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాన్సీ ఫోన్‌ నంబర్లు ఇస్తామంటూ చెప్పిన అవతలి వ్యక్తి రూ.2వేలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. అతడు చెప్పినట్టే ఉదయ్ మనీ ట్రాన్స్‌ఫర్ చేయగా.. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేసి రూ.55వేలు దోచుకున్నారు. కుందన్‌బాగ్‌లో నివాసముంటున్న ఆర్మీ మాజీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పేటీఎం ఖాతా బ్లాక్ అయిందంటూ కేటుగాళ్లు ఫోన్‌ చేసి వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా రూ.1.85 లక్షల నగదు దోచుకున్నారు. Also Read: ఎస్సార్‌ నగర్‌కు చెందిన హరీష్‌ రాజా అనే వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్‌ చేసి పేటీఎం ఖాతాను అప్‌డేట్‌ చేయాలంటూ వివరాలు తీసుకున్నారు. ఆ వెంటనే ఆయన బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ.1.32లక్షలు మాయమయ్యాయి. సికింద్రాబాద్‌లో ఉంటున్న కాశీనాథ్‌కు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కేవైసీని అప్‌డేట్ చేయకపోతే నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేస్తామని నమ్మించి రూ.1.03 లక్షలు కొట్టేశారు. అంబర్‌పేటకు చెందిన మొయీన్‌ తక్కువ ధరకే కారు విక్రయిస్తామంటూ ఆన్‌లైన్ ప్రకటన చూసి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి రెండు గంటల్లోనే కారు పంపిస్తామంటూ.. రూ.60వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. Also Read:


By April 14, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/cyber-criminals-stole-rs-4-75-lakh-from-hyderabad-people/articleshow/75133318.cms

No comments