స్నేహితుడే ప్రాణం తీశాడు.. కాగజ్నగర్లో టెన్త్ విద్యార్థి దారుణహత్య


పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని ఆ విద్యార్థి కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. స్నేహితుల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుమ్రుంభీం జిల్లా పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. సిర్పూర్(టి)కి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు(16) కాగజ్నగర్ సర్దార్బస్తీలోని నాయనమ్మ వద్దే ఉంటూ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. కరోనా కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. Also Read: లాక్డౌన్ నేపథ్యంలో ఆ బస్తీలోని యువకులంతా పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. సదరు విద్యార్థి, అదే కాలనీ యువకుడు ప్రవీణ్(25) స్నేహితులు. శనివారం రాత్రి అన్నదానానికి డబ్బుల పోగుచేసే విషయంలో మాటామాట పెరిగి గొడవ పడ్డారు. ఆ విద్యార్థి అందరి ముందు ప్రవీణ్పై చేయి చేసుకున్నాడు. కోపంతో ప్రవీణ్ రాత్రివేళ వెంట కత్తి తెచ్చుకుని ఆ విద్యార్థితో గొడవపడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ విద్యార్థి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే రాత్రి నాన్నమ్మ తన మనవడు ఇంటికి రాలేదంటూ వీధుల్లో వెతుకుతుండగా రక్తపు మడుగులో కనిపించడంతో కేకలు వేసింది. Also Read: దీంతో స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు రోదించారు. ఇంట్లో చదువుకుంటున్న తన మనవడిని ఫోన్ చేసి పిలిపించి మరీ హత్య చేశారంటూ నాయనమ్మ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చేతికొచ్చిన కొడుకు ప్రయోజకుడై వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడనుకున్నామని, కానీ ఇంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ స్వామి, టౌన్ ఎస్హెచ్ఓ డి.మోహన్, ఎస్ఐ తహసీయోద్దీన్ సందర్శించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read:
By April 27, 2020 at 08:33AM
No comments