లాక్డౌన్ ఎఫెక్ట్: పెళ్లి ఆగిపోయిందన్న బెంగతో వధువు తండ్రి మృతి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కారణంగా అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. లాక్డౌన్ కారణంగా కొందరు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేసుకుంటుంటే.. మరికొందరేమో కుటుంబసభ్యుల సమక్షంలో కానిచ్చేస్తున్నారు. జిల్లాకు మందసకు చెందిన వెంకటరావు అనే వ్యక్తి కూతురు పెళ్లి ఆగిపోతుందన్న బెంగతో గుండెపోటుకు గురై బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. Also Read: మందస మండలంలోని పిడిమందసకు చెందిన వెంకటరావు(54) వైజాగ్ స్టీల్ప్లాంట్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తెకు గురువారం వివాహం జరగాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం వెంకటరావు వివాహ శుభలేఖలు పంచేందుకు విశాఖపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.లాక్డౌన్ కారణంగా తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక విశాఖపట్నంలోనే చిక్కుకున్నారు. వరుడి తల్లి కూడా శుభలేఖలు బంధువులకు పంచేందుకు హైదరాబాదు వెళ్లి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. Also Read: ముహూర్తం దగ్గరపడడంతో కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే బెంగతో వెంకటరావు కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ బెంగతోనూ అతడికి గురువారం గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో మధ్యాహ్నానికి మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకువెళ్లగా పోలీసుల సూచనతో వెంటనే దహన సంస్కారాలు పూర్తిచేశారు. పెళ్లి జరగాల్సిన ఇంట చావు చూడాల్సి వచ్చిందని వెంకటరావు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:
By April 09, 2020 at 08:28AM
No comments