Breaking News

కరోనాపై యుద్ధానికి రూ.7,600 కోట్లు.. ట్విటర్‌ సీఈవో భూరి విరాళం


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కుబేరులు కదలివస్తున్నారు. తమ సంపదలో భారీ మొత్తాలను విరాళంగా ప్రకటిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో జాక్‌ డోర్సీ ఏకంగా 1 బిలియన్ డాలర్లు (రూ.7,600 కోట్లు) భారీ విరాళం ప్రకటించారు. తన డిజిటల్‌ చెల్లింపుల గ్రూప్‌ ‘స్వ్కేర్‌’లో నుంచి ఈక్వీటీ వాటాలను తన సేవా సంస్థ ‘స్టార్ట్‌ స్మాల్‌’కు మళ్లించనున్నట్లు ఆయన వెల్లడించారు. విరాళంగా ప్రకటించిన మొత్తం తన సంపదలో 28శాతం అని ఆయన తెలిపారు. Also Read: వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రపంచానికి సాయం అత్యవసరమని జాక్‌ డోర్సీ అభిప్రాయపడ్డారు. తన నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నానని. జీవితం చాలా చిన్నది కాబట్టి మనం ప్రజలకు చేయగలిగినదంతా ఈ రోజే ఇప్పుడే చేసేద్దాం... అంటూ ఆయన పిలుపునిచ్చారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాలికల విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. Also Read: మరోవైపు కరోనాపై పోరుకు వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాల్లో ఇదే అతిపెద్ద మొత్తమని భావిస్తున్నారు. ట్విటర్‌, స్వ్కేర్‌ సంస్థల్లోని షేర్లు సహా డోర్సీ మొత్తం సంపద దాదాపు 3 బిలియన్ డాలర్లు(రూ.22వేల కోట్లు) ఉంటుందని అంచనా. స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారెన్‌ పావెల్‌ జాబ్స్‌, హాలీవుడ్‌ నటుడు లినార్డో డికాప్రియోలు స్థాపించిన ఫుడ్‌ ఫండ్‌కు డోర్సీ ఇప్పటికే సుమారు రూ.77 లక్షల(లక్ష డాలర్లు)కు విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన పత్రాన్ని ఆయన ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు ఆహారం సమకూర్చేందుకు ఫుడ్‌ ఫండ్‌ సమర్ధవంతంగా పనిచేస్తోంది. Also Read:


By April 09, 2020 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/twitter-ceo-jack-dorsey-to-donate-1-billion-to-fund-covid-19-relief/articleshow/75057385.cms

No comments