Breaking News

కుట్టు మిషన్‌పై మాస్కులు కుడుతున్న రాష్ట్రపతి భార్య


దేశ వ్యాప్తంగా వణికిస్తున్న వేళ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ముందుకు వస్తున్నారు. కరోనా కోసం కొందరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. కొందరు అయితే మెడికల్ కిట్లు కూడా డొనేట్ చేస్తున్నారు. మరికొందరు సినీ తారలు, రాజకీయ నేతల కుటుంబాలు మాస్కులు తయారు చేస్తున్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కు తప్పనిసరి. అందుకే మాస్కులను కుట్టి పంపిణీ చేస్తున్నారు. తాజాగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య మాస్క్‌లు తయారు చేస్తున్నారు. స్వయంగా మిషన్‌పై ఆమె మాస్కులు కుడుతున్నారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శక్తి హాత్‌లో ముఖానికి ధరించే మాస్క్‌లను ఆమె కుట్టారు. ఢిల్లీలో ఉన్న షెల్టర్ హోమ్స్‌లో ఆ మాస్క్‌లను పంపిణీ చేయనున్నారు. ఎరుపు రంగు మాస్క్‌ను ముఖానికి ధరించిన సవితా కోవింద్ కుట్టుమిషన్‌పై మాస్క్‌లు కుట్టారు. అందరం కలిసికట్టుగా కోవిడ్‌19పై పోరాటం చేయాలన్నారామె. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా తప్పకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ కారణంగా శానిటైజర్, ఫేస్ మాస్కులకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వాలు, పెద్దలు మాస్కులు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అన్నదానిపై విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలని, అదికూడా ఇంటిదగ్గరే మాస్కులు కుట్టుకోవాలని దేశ ప్రజలకు సైతం ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కూతురు నైమిష ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులకోసం, ఇతర అవసరార్థుల కోసం మాస్కులు కుట్టారు.


By April 23, 2020 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/savita-kovind-stitches-masks-for-shelter-homes/articleshow/75314022.cms

No comments