Breaking News

కరోనా కలకలం: ఒక్క విందు.. క్వారంటైన్‌లోకి 26 వేల మంది!


మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన 10 మందికి కరోనా సోకడంతో అందులో పాల్గొన్నవారు, వారితో సన్నిహితంగా మెలిగిన 26 వేల మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచడం కలకలం రేగింది. మోరేనాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వెయింటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతడి తల్లి చనిపోవడంతో దుబాయ్ నుంచి మార్చి 17న మోరేనా నగరానికి వచ్చాడు. ఆమె మృతికి సంతాపంగా మార్చి 20న విందు ఏర్పాటుచేసి బంధు మిత్రులను పిలిచాడు. ఈ విందుకు దాదాపు 1,200 మంది హాజరయ్యారు. అయితే, తాను దుబాయ్ నుంచి వచ్చిన విషయం, ప్రయాణ వివరాలను అధికారులకు తెలియజేకుండా దాచిపెట్టాడు. ఈ నేపథ్యంలో మార్చి 27న అతడితోపాటు భార్య అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్‌ చేరారు. లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆరా తీయగా.. దుబాయ్‌ నుంచి వచ్చిన విషయం బయటపెట్టాడు. భార్యాభర్తలకు కరోనా వైరస్ సోకినట్టు ఏప్రిల్ 2న నిర్దారణ అయ్యింది. వీరితోపాటు విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా వైరస్‌ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ విందుకు హాజరైన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 27 వేల మందిని ఇళ్లలోనే క్వారంటైన్‌కు పరిమితం చేశారు. మోరేనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్సీ బందిల్ మాట్లాడుతూ.. భార్యభర్తలు ఇద్దరూ అనారోగ్యానికి గురికావడంతో హాస్పిటల్‌కు వచ్చారన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించడంతో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేశామని, ఏప్రిల్ 2న వైరస్ ఉన్నట్టు ఫలితాల్లో వెల్లడయ్యిందని తెలిపారు. అలాగే విందులో పాల్గొన్న 10కి వైరస్ సోకడంతో వారు నివశించే వార్డు 47ను మొత్తం షట్‌డౌన్ చేశారు. మొత్తం 27,881 మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో 26 వేల మంది అతడి బంధువులు, వారి కుటుంబసభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగినవారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం వీరిలో 24 మందిని జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.


By April 06, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/26-thousand-people-in-madhya-pradesh-are-at-risk-of-infection-all-made-quarantine/articleshow/75001628.cms

No comments