Breaking News

భారత్‌పై కరోనా పంజా... 19వేలకు చేరువలో కేసులు


భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 19వేలకు దగ్గర్లో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,601... కేసులు నమోదు అయ్యాయి. 590 మంది మృతి చెందారు. 3251మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 14,759 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో కేసుల సంఖ్య 4666 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబై నగరంలోనే 3వేలకు పైగా కేసులు ఉన్నాయి. తమిళనాడులో 1520 కేసులు రికార్డ్ అయ్యాయి. ఒక్కరోజులోనే 43 పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయినట్లు తెలుస్తోంది. దేశంలో కొత్తగా1336 కేసులు రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 705 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఢిల్లీలో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్రపతి భవన్‌లో ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతనికి కూడా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్‌ కారణంగా మృతి చెందారు.పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది తెలంగాణలో సోమవారం 14 కొత్త కేసులు వచ్చాయి. ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 872గా ఉంది. ఇందులో 186 మంది ‌డిశ్చార్జి అయ్యారు. 23 మంది మరణించారు. అటు ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సోమవారం ఒక్క రోజే 75 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. అందులో 92 మంది డిశ్చార్జి అయ్యారు. 20 మంది చనిపోయారు.


By April 21, 2020 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/total-covid-19-cases-in-india-rise-to-18601-one-in-rashtrapati-bhavan/articleshow/75263910.cms

No comments