చిత్తూరులో కామాంధులు... ఏడు నెలల గర్భిణిపై అఘాయిత్యం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంగా 21రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించినా కామాంధులు మాత్రం తమ కీచకపర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జిల్లా కేవీబీపురం మండలం అంజూరు గిరిజనకాలనీలో ఏడు నెలల గర్భిణి అయిన గిరిజన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించారు. అంజూరు గిరిజన కాలనీకి చెందిన ఓ యువకుడు భార్య, అమ్మనాన్నతో కలిసి పంట పొలాల్లో గుడిసె వేసుకుని పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గర్భంతో ఉన్న భార్య(24)ను ఇంట్లోనే ఒంటరిగా వదిలి గురువారం తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్లాడు. Also Read: మధ్యాహ్నం సమయంలోనే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సాయి(24), వినోద్(25) పొలం పనులకు వెళ్లి ఈ గుడిసెల వైపుగా వచ్చారు. గుడిసెల్లో ఎవరూ లేకపోవడాన్ని గుర్తించిన ఆకతాయీలు లోపలికి చొరబడి గర్భిణీపై అత్యాచారానికి యత్నించారు. శారీరకంగా హింసించారు. మహిళ ప్రతిఘటించగా, ఆమె పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు భయపడి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కేవీబీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: అయితే నిందితులపై చర్యలు తీసుకోకుండా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్స్టేషన్లోనే ఓ పార్టీ నాయకులు పోలీసులతో మంతనాలు జరిపారని, బాధితుల ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు పోలీస్స్టేషన్లో ఉన్న నిందితులు ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. Also Read:
By March 27, 2020 at 09:19AM
No comments