కర్నూలులో కట్నపిశాచి.. గర్భిణి చేతి నరాలు కట్ చేసి దారుణంగా చంపేసిన భర్త

కాలం ఎంత మారుతున్నా కట్న పిశాచుల మనసులు మాత్రం మారడం లేదు. కట్నం కోసం భార్యలను వేధిస్తూ ప్రాణాలు తీస్తున్న అనాగరిక ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా జిల్లా ఆళ్లగడ్డలో వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలైపోయింది. తాళి కట్టిన భర్తే ఆమెను కిరాతకంగా చంపేశాడు. Also Read: ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రతాప్ అనే యువకుడికి తొమ్మిది నెలల క్రితం సుస్మిత(20) అనే యువతితో 9 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణి. ఆమె తల్లి చనిపోవడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి తమ్ముడికే సుస్మితను ఇచ్చి వివాహం చేశారు. వివాహం సమయంలో రూ.3 లక్షలు వరకు కట్నం ఇచ్చారు. మొదట్లో కాపురం బాగానే ఉన్నా ఇటీవల వరకట్నం కోసం భర్త, అత్త తరచూ వేధింపులకు గురి చేసేవారు. Also Read: దీనిపై రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ప్రతాప్ భార్యను బయటకు తీసుకెళ్లాడు. మండలంలోని బత్తలూరు వద్ద బైక్ ఆపి భార్య నరాలను కత్తితో కోసేశాడు. అనంతరం చున్నీతో చేతులను కట్టేసి పొలాల్లోని కుంటలో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. సుస్మిత కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఆదివారం ఉదయం అందరూ కలిసి నిలదీయగా భార్యను చంపేసి కుంటలో పడేశానని చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరకట్న వేధింఫుల కారణంగానే సుస్మితను హత్య చేసినట్లు గుర్తించి భర్త ప్రతాప్, అతడి కుటుంబసభ్యులు వీరన్న, మస్తానమ్మ, భాస్కర్, నరసమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By March 16, 2020 at 11:53AM
No comments