ఈశాన్య రాష్ట్రాల్లో తొలి కరోనా కేసు నమోదు.. యూకే నుంచి వచ్చిన యువతికి..

భారత్ మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో విలవిల్లాడుతుంటే... ఇప్పటి వరకూ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ కేసులు నమోదు కాలేదు. కానీ మణిపూర్తో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. మార్చి 19న యూకే నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ యువతి చదువుకోవడం కోసం యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆ యువతిని ఐసోలేషన్ కోసం హాస్పిటల్కు తరలించి, ఆమె కుటుంబ సభ్యులను క్వారంటైన్లో ఉంచారు. వారందరి దగ్గర్నుంచి శాంపిళ్లను సేకరించారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 500కు చేరువ కాగా, మహారాష్ట్రలో 101 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అనే సంగతి తెలిసిందే.
By March 24, 2020 at 10:28AM
No comments