Breaking News

కరోనా ఎఫెక్ట్.. షిర్డీ ఆలయంలోకి భక్తులకు నో ఎంట్రీ


భారత్‌లో కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 126 మందికి కరోనా సోకగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోకెల్లా అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. దీంతో షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మంగళవారం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భక్తులకు సాయినాథుని దర్శన భాగ్యం ఉండబోదని తెలిపింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో భక్తులు సాయినాథుడి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆదివారం భక్తులను కోరింది. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ముంబాదేవి గుడి సహా మహారాష్ట్రలోని పలు ప్రముఖ దేవాలయాల్లోకి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ భక్తులను అనుమతించరు. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 39 మంది కోవిడ్ బారిన పడగా.. ముంబైలో 64 ఏళ్ల వృద్ధుడు ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. కరోనా వైరస్ భయాందోళనల కారణంగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.


By March 17, 2020 at 12:23PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shirdi-saibaba-temple-to-close-for-devotees-from-tuesday-afternoon-amid-coronavirus-scare/articleshow/74668961.cms

No comments