రాజధానిలో గుట్టుగా వ్యభిచారం.. నలుగురు విటులు, ఐదుగురు యువతుల అరెస్ట్

రాజధాని భువనేశ్వర్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం అందడంతో క్రైమ్ బ్రాంచ్కు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ప్రాంతంలో సాగుతున్న సెక్స్ రాకెట్ను చేధించారు. Also Read: ఈ సందర్భంగా విటులు బీహార్కు చెందిన బిద్యపతి సాహా, కటక్కు చెందిన దీన్దయాళ్రావు, పిపిలికి చెందిన అల్లియుద్దీన్ ఖాన్, సునీల్ మొహారానాను అరెస్ట్ చేశారు. ఐదుగురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఒడిశాకు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు కోల్కతాకు చెందినవారుగా గుర్తించారు. Also Read: సంఘటనా స్థలం నుంచి రెండు కార్లు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఒక్కనెలలోనే భువనేశ్వర్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలను చేధించి 16 మంది సెక్స్వర్కర్లకు విముక్తి కల్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లర్ల ముసుగులో అనేకమంది సెక్స్ దందాలకు పాల్పడుతున్నారని తమకు సమాచారమున్నట్లు వెల్లడించారు. Also Read:
By March 15, 2020 at 12:06PM
No comments