తమిళనాడు: కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు దుర్మరణం

తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఘోర సంభవించింది. నమక్కల్ వద్ద కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో కారులోని ఆరుగురు మృతి చెందారు. వాహనంలోని మరొకరు గాయపడ్డారు. మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్లో చేర్పించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించే చర్యలు చేపట్టారు. గత నెలలో కోయంబత్తూరు తిరుప్పూర్ సమీపంలో ఓ టైల్స్ లోడుతో వెళ్తున్న ఓ కంటెయినర్ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ బస్సుపైకి దూసుకెళ్లడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి కేరళలోని ఎర్నాకుళానికి వెళ్తున్న కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన వోల్వో బస్సును కోయంబత్తూరు నుంచి సాలెమ్ వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమదంలో 20 మంది మృతిచెందగా వీరిలో 14 మంది పురుషులు, ఐదుగురు మహిళలున్నారు.
By March 14, 2020 at 08:00AM
No comments