Breaking News

నిర్భయ కేసు: నిందితుల లాయర్ నక్కజిత్తులు.. తెల్లవారుజాము వరకు వాదనలు


నిందితులు ఉరి నుంచి తప్పించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. ఉరి వాయిదాపై ఢిల్లీ హైకోర్టులో గురువారం అర్ధరాత్రి వరకు వాదనలు జరగ్గా.. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత లాయర్ ఏకంగా సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. దోషి పవన్ గుప్తా తరపున అత్యవసర పిటిసన్ దాఖలు చేయడంతో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. వేకువజామున 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై ఏపీ సింగ్ తన వాదనల్ని వినిపించారు. ఉరి అమలుపై స్టే ఇవ్వాలని రెండు మూడు రోజులు సమయం ఇవ్వాలని వాదించారు. ధర్మాసనం మాత్రం ఇప్పటికే వాదనలన్నీ వినేశామని.. ఇక చేసేదేమీ లేదని తేల్చి చెప్పింది. పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్భయ దోషులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు 5-10 నిమిషాలు అనుమతివ్వాలని లాయర్ కోరారు. అనుమతి ఇచ్చే అంశంపైనిర్ణయం తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు ధర్మాసనం కోరగా.. ఆయన మాత్రం అంగీకరించలేదు. దీనికి జైలు నియమాలు అనుమతించవని మెహతా తేల్చి చెప్పారు. సుప్రీం తీర్పుపట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు తమకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందన్నారు.


By March 20, 2020 at 06:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nirbhaya-case-convicts-lawyer-ap-singh-try-to-stop-hang-till-last-minute/articleshow/74721481.cms

No comments