పాలకొల్లులో సైకో వీరంగం.. పలువురికి గాయాలు... పోలీసులపైనా దాడి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. తమిళనాడులోనిక తంజావూరుకు చెందిన సులేన్ అనే వ్యక్తి స్థానిక యడ్లబజారు ప్రాంతంలో దాదాపు గంటన్నర పాటు సైకోలాగా ప్రవర్తించాడు. ముందుగా ఆ ప్రాంతంలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి నైవేద్యం పెట్టే సమయంలో భక్తులతో పాటు క్యూలైన్లో వేచి ఉన్నాడు. ఒక్కసారిగా అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పూజరితో పాటు భక్తులు అడ్డుకోబోయారు. అక్కడే ఉన్న శఠగోపురం పల్లెంను తీసుకుని పూజారి తలపై కొట్టాడు. అమ్మవారి పూజాసామగ్రిని చెల్లాచెదురు చేశాడు. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. Also Read: అదే ప్రాంతంలో ఓ స్వీట్షాప్లోకి ప్రవేశించిన అన్నీ నాశనం చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిని యజమానిని కొట్టాడు. రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న పలువురిపై దాడి చేశాడు. దీంతో అక్కడవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. సులేన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని రక్తమొచ్చేలా కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోగా ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించాడు. అతడి ప్రవర్తన సైకోలాగా కనిపించడంతో స్థానికులంతా అదుపు చేసేందుకు కర్రలతో దేహశుద్ధి చేశారు. పోలీసుల సహకారంతో బలవంతంగా తాళ్లతో కట్టే ప్రయత్నం చేయగా తెంచేసుకున్నాడు. దీంతో చివరకు వైర్లతో కట్టాల్సి వచ్చింది. అనంతరం ఆ సైకోను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: కుటుంబ కలహాలు ఉన్నందున మొదటి నుంచి మతిస్థిమితం లేకుండా ఉన్న సులేన్కు ఇంటి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఇలా సైకోగా మారాడని తెలుస్తోంది. తంజావూరు నుంచి అతనితో పాటు మరికొందరు పాలకొల్లు వచ్చి పండ్ల రసం వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. చికిత్స అనంతరం సులేన్ను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పాలకొల్లు టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు తెలిపారు. Also Read:
By March 16, 2020 at 10:16AM
No comments