Breaking News

తీహార్ జైల్లో నిర్భయ దోషుల చివరి రోజు ఇలా గడిచింది


దేశంలో సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష పూర్తైంది. తీహార్ జైల్లో నలుగురు ఉరి కొయ్యలకు వేలాడారు.. శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇటు జైలు అధికారులు గురువారం హైలెవల్ సమావేశం నిర్వహించగా.. ఉరికి ముందు నలుగురు జైల్లో ఎలా గడిపారో అక్కడి జైలు వర్గాల సమాచారం మేరకు.. నలుగురు దోషులు జైల్లో క్షణమొక యుగంలా గడిపారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. ఉరికి ముందు నలుగురు దోషులు తమ సెల్‌లో విశ్రాంతి లేకుండా గడిపారు.. వారిలో భయం కనిపంచింది. ముఖేష్ సింగ్, వినయ్ శర్మ గురువారం రాత్రి భోజనం చేశారు. పవన్ గుప్తా మాత్రం భోజనం చేయడానికి నిరాకరించాడు. గత 24 గంటల పాటూ ఇక నలుగురి కదలికల్ని గమనించడానికి 15మందిని జైలు అధికారులు నియమించారు. జైలు నిబంధనల ప్రకారం తెల్లవారుజామున నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారి చివరి కోరిక గురించి అడగ్గా.. నలుగురు మౌనం వహించారు.. అనంతరం వేకువజామున 5.30గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. మరోవైపు ఉరి శిక్ష అమలు తర్వాత నలుగురి మృతదేహాలను దీన్ దయాళల్ ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తిస్తారు.. తర్వాత వారికి అప్పగిస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే.. జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలాగే జైల్లో ఉన్నంతకాలం నలుగురు దోషులు పనులు చేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబాలకు అందజేయనున్నారు.


By March 20, 2020 at 06:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nirbhaya-rape-case-convicts-has-restless-on-before-hanging-day/articleshow/74721646.cms

No comments