Breaking News

మారుతీరావు ఆత్మహత్యపై దర్శకుడి కామెంట్స్.. కచ్చితంగా అదే జరుగుతుందట


సంచలనం సృష్టించిన మిర్యాలగూడ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీ రావు శనివారం (మార్చి 7) అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యా భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురి జీవితాన్ని నాశనం చేసాడన్న బాధతోనో లేక మరేదైనా కారణంతోనే మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ‘పలాస 1978’ సినిమా దర్శకుడు కరుణ కుమార్ స్పందించారు. ‘ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. అమ్మాయి గర్భందాలిస్తే భర్త ఆమెను చెకప్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా నడిరోడ్డు మీద నరికేసారు. ఈ ఘటన జరగడానికి ముందు వాళ్లు తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కనుంటారు. అవన్నీ ఒక్క క్షణంలోనే చిద్రమైపోయినట్లే కదా. దీని అంతటికీ కారణం కులం. ఈ ఘటన జరిగిన ఏడాది అవుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడు. ఆ అబ్బాయి నిజంగానే మంచివాడు కాదు అన్నప్పుడు వద్దమ్మా అని చెప్పినా కూడా అర్థం ఉంది. అంతేకానీ అతను తక్కువ కులానికి చెందినవాడు అని చంపేయడం ఎంత వరకు కరెక్ట్?' READ ALSO: ' మారుతీరావుగారు అలా చనిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. ప్రణయ్ కులానికి చెందినవారు తమ కులాన్ని అగౌరవ పరిచాడు, మచ్చతెచ్చాడు అని చెప్పి మారుతీ రావు విగ్రహం కూడా ఏర్పాటుచేస్తారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. కచ్చితంగా ఇదే జరుగుతుంది. ఈ సినిమాలో కూడా మేం ఎవరి కులాన్ని కూడా తక్కువ చేసి చూపించలేదు. అందరినీ సమానంగానే చూపించాం’ అని తెలిపారు. READ ALSO:


By March 09, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/palasa-1978-movie-director-karuna-kumar-comments-on-maruthi-rao-suicide-case/articleshow/74545353.cms

No comments