Breaking News

కరోనా ఎఫెక్ట్... నాలుగు గంటలే బ్యాంక్ సేవలు


కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తాజాగా బ్యాంకింగ్ వ్యవస్త వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. పనిగంటల్ని తగ్గించాయి. ఇకపై కేవలం నాలుగు గంటలే పనిచేస్తాయని తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆర్యోగం నిమిత్తం... పని గంటలను మార్చాయి. సాధారణంగా బ్యాంకులు ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. కానీ ఇక నుంచి బ్యాంకింగ్ సేవలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేట్‌ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటివి డిజిటల్‌ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ఖాతాదారులను కోరుతున్నాయి. బ్యాంకులు డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా తగ్గిస్తున్నాయి. కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండడం ఇందుకు ప్రధాన కారణమని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈనెల 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని ప్రకటించాయి. ఈనెల 31 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌ అధికారులు తెలిపారు. కస్టమర్లు కూడా కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాంకు సేవల్లో చేస్తున్న మార్పులకు సహకరించాలని కోరుతున్నాయి. మరోవైపు బ్యాంకులు ఇదివరకే చాలా సర్వీసుల్ని ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాయి. మొబైల్ లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా సర్వీసులు పొందాలని కోరాయి. ఏమైనా అర్జంట్ పని ఉంటేనే బ్యాంకులకు రావాలన్నాయి. 24 గంటలూ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామని పేర్కొంది. అవసరం అయితే బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్‌కు కాల్ చేయాలన్నాయి. అవసరం లేకుంటే ఐవీఆర్ ఫెసిలిటీ ద్వారా సర్వీసులు పొందొచ్చని బ్యాంకింగ్ అధికారులు తెలిపారు.


By March 24, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/banks-revise-branch-timings-push-use-of-digital-transactions/articleshow/74786063.cms

No comments