Breaking News

ఇద్దరు పిల్లలకు తల్లి... ప్రియుడిని మరిచిపోలేక ఏం చేసిందంటే


ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మహిళ అటు భర్తతో కాపురం చేయలేక, ప్రియుడితో కలిసి బ్రతికే అవకావం రాక తీవ్ర మనో వేదనకు గురైంది. కలిసి బ్రతకలేనప్పుడు కలిసైనా చనిపోదామని నిర్ణయించుకుంది. దీనికి ప్రియుడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి విషం తాగేశారు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మంగళవారం జరిగింది. Also Read: కన్యాకుమారి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బినో, అదే ప్రాంతానికి చెందిన యువతి(29) చాలాకాలం ప్రేమించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను తిరస్కరించి ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కాలం గడిచినా ఆ యువతి మాత్రం తన ప్రేమను చంపుకోలేకపోయింది. అప్పుడప్పుడు భర్త కళ్లుగప్పి ప్రియుడితో శారీరకంగా కలుస్తూ ఉండేది. తాను భర్తతో ఉండలేకపోతున్నానని యువతి చెప్పడంతో బినో తన వద్దకు వచ్చేయమన్నాడు. కుటుంబాన్ని వదిలి వచ్చేస్తే పరువు పోతుందని భయపడింది. దీంతో ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. Also Read: సోమవారం ఇద్దరూ ఉవరి ప్రాంతంలోని సముద్ర తీరానికి వచ్చారు. అక్కడే విషయం తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో పడివున్న వారిద్దరిని స్థానికులు గుర్తించి తిరునెల్వేలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 25, 2020 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-attempt-to-suicide-with-boy-friend-in-tamil-nadu/articleshow/74805613.cms

No comments