Breaking News

ఇటలీ, ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు.. క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు


కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటి వరకూ 234 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్టు ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి జయశంకర్ ఆదివారం వెల్లడించారు. వీరిలో 131 మంది విద్యార్థులు, 103 మంది యాత్రికులు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి.. ‘ఇప్పటి వరకూ 131 మంది విద్యార్థులు, 103 మంది యాత్రికుల సహా 234 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.. భారతీయులను స్వదేశానికి రప్పించడంలో అక్కడ అక్కడ భారత రాయబార కార్యాలయం, ఇరాన్ అధికారులు సహకారం మరువలేనిదని’ జయశంకర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మూడో విడత భారతీయుల బృందం ఆదివారం ఉదయం భారత్‌కు చేరుకుంది. గత శనివారం 58 మంది, శుక్రవారం 44 మంది రెండు విడతల్లో చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా, 132 మంది భారత్ చేరుకున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. వైరస్ భయంతో విమానాశ్రయాలు, ఓడరేవులను ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేసింది. దీంతో అక్కడ దాదాపు 2,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. మరోవైపు, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కూడా స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఇటలీకి వైద్యుల బృందాలను పంపిన కేంద్రం.. అక్కడ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం మొత్తం 218 మంది భారత్‌కు చేరుకున్నారు. వీరిని చావ్లాలోని ఐటీబీపీ క్యారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారిని జైసల్మేర్‌లో ఏర్పాటుచేసిన శిబిరానికి తరలిస్తున్నారు. ఇరాన్ నుంచి ముంబైకి.. అక్కడ నుంచి జైసల్మేర్‌కు ప్రత్యేక విమానంలో తరలించినట్టు అధికారులు తెలిపారు. రెండు వారాల పాటు క్యారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తామని కల్నల్ ఘోష్ తెలిపారు. శిబిరాల్లో ఉన్నవారికి సైనికులు స్వచ్ఛందంగా సేవలు అందజేస్తున్నారు. మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌తో మృతి చెందిన కర్ణాటక మహమ్మద్‌ సిద్దిఖి హుసేనీ అంత్యక్రియలలో పాల్గొన్న వారందరిపైనా నిరంతర నిఘా కొనసాగుతోంది. హుసేనీ కరోనా బారిన పడి హైదరాబాద్‌లో మృతి చెందగా కలబుర్గిలో అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందినప్పటికి ల్యాబ్‌ రిపోర్టులు రాకపోవడంతో అనుమానితుడిగానే భావించారు. మరుసటి రోజున కరోనా వైరస్‌ ద్వారానే మృతి చెందినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి నలుగురిని మాత్రమే ఐసోలేషన్‌ విభాగంలో ఉంచి చికిత్సలు అందిస్తుండగా మిగిలిన 67మందిని ఆసుపత్రి నుంచి బయటకు రాకుండా పర్యవేక్షిస్తున్నారు.


By March 15, 2020 at 11:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indians-from-virus-hit-iran-and-italy-arrive-in-india-shifted-to-quarantine-centre/articleshow/74634856.cms

No comments