Breaking News

ఇరాన్‌లో కోవిడ్ కల్లోలం: మొన్న మాజీ దౌత్యవేత్త.. నేడు ఎంపీ మృతి


ఇరాన్‌లో పంజా కొనసాగుతోంది. మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ కోవిడ్‌ 19తో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు తస్నమ్ న్యూస్ వెల్లడించింది. రహబార్ ప్రస్తుతం టెహ్రాన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనా తర్వాత ఇరాన్‌లోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 124 మంది చనిపోగా, 4,747 కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్, గార్డియన్ కౌన్సిల్‌కు మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఎక్స్‌పెడియెన్సీ కౌన్సిల్ సభ్యుడు మహ్మద్ మిర్‌మొహమద్ మృతిచెందినట్టు మార్చి 2న తస్నిమ్ ప్రకటించింది. అలాగే ఇరాన్ డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్ హరచ్చాయ్, పార్లమెంట్ సభ్యుడు మహమ్మద్ సడ్‌గీల కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. మరోవైపు, కొవిడ్‌-19ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హితవు పలికింది. పలు దేశాలు తాజా సంక్షోభాన్ని తీవ్రంగా పరిగణించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. వైరస్‌ను నిరోధించే విషయంలో ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో హాస్పిటల్స్ సన్నద్ధత సరిగా లేదంటూ నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అధినేత టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రియెసుస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పేద, ధనిక అనే తారతమ్యాల్లేకుండా అన్ని దేశాలకు కొవిడ్‌-19 ముప్పేనని పేర్కొన్నారు.


By March 07, 2020 at 04:11PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iranian-lawmaker-dies-from-coronavirus-death-toll-to-124-in-iran/articleshow/74526549.cms

No comments