Breaking News

ఉన్నావ్ ఘటన: బాధితురాలి తండ్రి మృతి కేసులో ఆ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు


ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌‌కు న్యాయస్థానం శిక్ష ఖరారుచేసింది. ఈ కేసులో సెంగార్‌తోపాటు మరో ఏడుగుర్ని ఢిల్లీ న్యాయస్థానం గతవారం దోషులుగా నిర్ధారించింది. దోషులకు శుక్రవారం శిక్షలు ఖరారుచేసిన న్యాయస్థానం.. జరిమానా కూడా విధించింది. ఈ కేసులో సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మిగతా దోషులకు పదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, అత్యాచారం కేసులో ఇప్పటికే సెంగార్‌‌కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. బాధితుడిపై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టి, పోలీసులతో అరెస్ట్ చేయించారనడానికి విచారణలో పక్కగా సాక్ష్యాలు విచారణలో లభ్యమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిని చంపాలని ఉద్దేశం నిందితుడికి లేకపోయినా, కానీ, అతడిపై దారుణంగా దాడిచేసి అతడి మరణానికి కారకులయ్యారని పేర్కొంది. పోలీసుల కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యంత పాశవికంగా కొట్టారు.. వైద్యులు కూడా మానవత్వం లేని మనుషుల్లా నిర్లక్ష్యం వహించారని న్యాయమూర్తి మండిపడ్డారు. కాగా, గతేడాది జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జైళ్లో ఉన్న తన బంధువును కలుసుకోడానికి లాయర్, కుటుంబసభ్యులతో వెళ్తున్న ఆమె వాహానాన్ని ట్రక్కుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, బాధితురాలు, లాయర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసును ఢిల్లీకి బదిలీచేసి.. బాధితులను వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు.


By March 13, 2020 at 12:34PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/unnao-rape-kuldeep-sengar-gets-10-years-in-jail-for-death-of-victims-father/articleshow/74607723.cms

No comments