Breaking News

ఏపీలో కరోనా కలకలం... తిరుపతి రుయాలో చేరిన తైవాన్ జాతీయుడు


ఏపీలో మరోసారి కలకలం రేగింది. తైవాన్‌కు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తి దగ్గు, గొంతు నొప్పి లాంటి కరోనా లక్షణాలతో శనివారం తిరుపతి రుయా హాస్పిటల్‌లోని ఐలేషన్ వార్డులో చేరాడు. ఆయనకు కరోనా వైరస్ సోకిందా లేదా అని తేల్చడం కోసం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తైవాన్ వ్యక్తికి కరోనా సోకిందనే ప్రచారంతో తిరుపతి ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. తైవాన్ జాతీయుడైన చెన్ షి షన్ పలమనేరులోని ఓ ప్రయివేట్ కంపెనీలో మెషిన్ రిపేర్ కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారు. గత పదిరోజులుగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. దగ్గు, గొంతు నొప్పి బాధిస్తున్నాయని షన్ శనివారం సాయంత్రం హాస్పిటల్‌లో చేరారని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య తెలిపారు. లక్షణాలను గమనించిన తర్వాత డాక్టర్లు ఆయన్ను రుయా హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపారని డాక్టర్ పెంచలయ్య తెలిపారు. ఆయనకు కరోనా వైరస్ లేదని భావిస్తున్నామన్నారు. మరోవైపు విశాఖపట్నం జిల్లాలోనూ కరోనా కలకలం రేగింది. అనకాపల్లికి చెందిన 24 ఏళ్ల ఓ యువకుడు ఇటీవలే దక్షిణా కొరియా నుంచి వచ్చారు. దగ్గుతో బాధపడుతుండటంతో అతణ్ని చెస్ట్ హాస్పిల్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు యువకుడు ఢిల్లీలో ఓ మొబైల్ ఫోన్ కంపెనీలో పని చేస్తున్నాడు. డిప్యుటేషన్ మీద ఆయన్ను దక్షిణ కొరియా పంపారు. అక్కడ కరోనా విజృంభిస్తుండటంతో అతడు సొంతూరు తిరిగి వచ్చాడు. అతడి శాంపిల్లను సేకరించిన డాక్టర్లు పరీక్షల కోసం పుణే పంపారు.


By March 01, 2020 at 02:49PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/taiwan-national-in-isolation-ward-in-tirupati-with-coronavirus-symptoms/articleshow/74425173.cms

No comments